ETV Bharat / bharat

'మరో దఫా చర్చలు ఎప్పుడు పెట్టుకుందాం?'

author img

By

Published : Dec 14, 2020, 4:47 PM IST

Updated : Dec 14, 2020, 10:22 PM IST

సాగు చట్టాలపై రైతుల నిరసనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో.. వారితో మరో దఫా చర్చలు జరిపేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. చర్చల తేదీని నిర్ణయించేందుకు రైతు నేతలను సంప్రదిస్తున్నట్టు వెల్లడించారు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. ఎప్పుడు చర్చలు జరిపినా.. పాల్గొనేందుకు కేంద్రం సిద్ధమని పేర్కొన్నారు.

We are engaging with farmers to decide on next date of talks: Agriculture Minister Tomar
'మరో దఫా చర్చల కోసం రైతులతో కేంద్రం సంప్రదింపులు'

మరో దఫా చర్చల కోసం ఓ తేదీని నిర్ణయించేందుకు రైతు నేతలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ వెల్లడించారు. ఏ సమయంలోనైనా చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో అన్నదాతల నిరసనలు ఉద్ధృతమైన నేపథ్యంలో తోమర్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"రైతులతో సమావేశం కచ్చితంగా జరుగుతుంది. తేదీని నిర్ణయించేందుకు అన్నదాతలను సంప్రదిస్తున్నాం. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే. ఇక అంతా రైతుల చేతిలోనే ఉంది. తదుపరి చర్చల కోసం ఓ తేదీని నిర్ణయించి ప్రభుత్వానికి వారే తెలియజేయాలి."

--- నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ మంత్రి.

రైతులు-కేంద్రం మధ్య ఇప్పటివరకు ఐదు దఫాల చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. అయితే చట్టాల రద్దు కుదరని పని అని తేల్చిచెప్పిన కేంద్రం.. పలు సవరణలు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది.

ఇవీ చూడండి:- నిరాహార దీక్షతో సాగు చట్టాలపై పోరు బాట

మరో దఫా చర్చల కోసం ఓ తేదీని నిర్ణయించేందుకు రైతు నేతలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ వెల్లడించారు. ఏ సమయంలోనైనా చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో అన్నదాతల నిరసనలు ఉద్ధృతమైన నేపథ్యంలో తోమర్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"రైతులతో సమావేశం కచ్చితంగా జరుగుతుంది. తేదీని నిర్ణయించేందుకు అన్నదాతలను సంప్రదిస్తున్నాం. చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధమే. ఇక అంతా రైతుల చేతిలోనే ఉంది. తదుపరి చర్చల కోసం ఓ తేదీని నిర్ణయించి ప్రభుత్వానికి వారే తెలియజేయాలి."

--- నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ మంత్రి.

రైతులు-కేంద్రం మధ్య ఇప్పటివరకు ఐదు దఫాల చర్చలు జరిగాయి. అయినప్పటికీ ఎలాంటి ఫలితం దక్కలేదు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. అయితే చట్టాల రద్దు కుదరని పని అని తేల్చిచెప్పిన కేంద్రం.. పలు సవరణలు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది.

ఇవీ చూడండి:- నిరాహార దీక్షతో సాగు చట్టాలపై పోరు బాట

Last Updated : Dec 14, 2020, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.